Suryaa.co.in

Telangana

గడ్కారి నోట “నో” అనే పదం వినలేదు

– నితిన్ గడ్కారి మీటింగ్ లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్: పార్లమెంటులో అన్ని పార్టీల ఆమోదం పొందిన ఏకైక మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖే. “నో” అనే పదం ఆయన నోట నుంచీ వినలేదు – ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వెంటనే స్పందించే శైలి. నేను పార్లమెంట్‌కు వెళ్లాక నితిన్ గడ్కరీ తో పరిచయం అనేది తక్కువైనా, వారి స్పందన మాత్రం అద్భుతం.

ఒక సందర్భంలో, వరంగల్ హైవేపై చిన్నారులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేయగానే, ఐదు ఫ్లైఓవర్లు – జోడిమెట్ల, ఎన్టీపీసీ, ఘట్ కేసర్, మైసమ్మ టెంపుల్, అంకుశాపూర్ ప్రాంతాలకు – ఒకేసారి మంజూరు చేసిన దయార్ద హృదయుడు.

బాలానగర్ నుంచి గండిమైసమ్మ వరకు ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఇంకొక ఎక్స్‌ప్రెస్ వే మంజూరుకు విజ్ఞప్తి చేస్తున్నాను. జీడిమెట్ల, సనత్ నగర్ వంటి పరిశ్రమలతో నిండిన ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే, ఉప్పల్ కారిడార్‌ను, కొంపల్లి కారిడార్‌ను వేగంగా పూర్తి చేసి ప్రజల కోసం మీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుతున్నాను.

శామీర్ పేట నుంచి కరీంనగర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని అనేక ప్రజల విజ్ఞప్తులు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో దీన్ని కూడా త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాము. వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులతో తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తున్న నితిన్ గడ్కరీ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

LEAVE A RESPONSE