Suryaa.co.in

Andhra Pradesh

దేవినేని కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమేరకు ఆమె నందిగామలోని ఆయన స్వగృహానికి వెళ్లి దేవినేని కుటుంసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దివంగత దేవినేని చంద్రశేఖర్ భార్య,పిల్లలను ఆమె ఓదార్చారు. దేవినేని ఉమ తల్లికి ధైర్యం చెప్పారు. దేవుడు మీ కుటుంబానికి నైతికస్థైర్యం ఇవ్వాలని ప్రార్ధించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

శుక్రవారం కంచికచర్ల లోని వారి స్వగృహానికి విచ్చేసిన నారా భువనేశ్వరి చంద్రశేఖర్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం చంద్రశేఖర్ సతీమణి పల్లవి, కుమారుడు సూర్య ప్రదీత్, కుమార్తె సిరిచందన లను ఓదార్చారు. దేవినేని ఉమా గారి తల్లి సీతమ్మని , ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం , కేశినేని ఫౌండేషన్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాద్ (చిన్ని) , మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య , నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు , మైలవరం నందిగామ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE