ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ నిలిచింది.నిజామాబాద్కు చెందిన 25 ఏళ్ల నిఖత్ 52కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచింది.ఫైనల్లో జిత్పోంగ్ జుటామా(థాయ్లాండ్)ను ఓడించి కెరీర్లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్షిప్’ బంగారు పతకం గెలిచింది.భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ C మాత్రమే ఈ టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచారు.