ఆ 50 మందికి ఈసారి ఎన్నికల్లో నో టికెట్?

– వైఎస్సార్సీపీ లో 50 మంది ఎమ్మెల్యేలపై జగన్ స్పెషల్ ఫోకస్
– తొలిసారి ఎన్నికైన 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం
– 12 మంది సీనియర్ ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి
– పార్టీపట్ల నిబద్దత, పార్టీమారే అవకాశం ఉన్న ఇంకొందరిపై వేటు
– పనితీరుపై ఇప్పటికే జగన్‍కి ఇంటిలిజెన్స్ రిపోర్ట్
– పనితీరు, ఆరోపణల నేపథ్యంలో కొంతమందిపై వేటు?
-మరో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేపైనా వేటుకు చాన్స్
– జగన్ చేతిలో 50 మంది పర్‍ఫార్మెన్స్ రిపోర్ట్
– 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ దిశానిర్ధేశం
– అరగంటపాటు జరిగిన వైసీఎల్పీ సమావేశం
– మూడేళ్ల తర్వాత సమావేశమైన వైసీఎల్పీ

ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి: సీఎం వైఎస్ జగన్..
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

సీఎం జగన్‌ సూచించిన పలు మార్గనిర్దేశకాలు..
ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌
ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామన్న సీఎం జగన్‌
క్యాడర్‌ ప్రజలకు దగ్గర చేయాలన్న సీఎం
బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలి
ysrlp1
బూత్‌ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి
ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి
ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి
మే నెల నుంచి నెలలో 10 సచివాలయాలను సందర్శించాలి
ఒక్కో గ్రామ సచివాలయానికి వారంలో రెండు రోజులు వెళ్లాలన్న సీఎం జగన్‌

ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్న సీఎం
కొత్త జిల్లాల వారీగా రీజినల్‌ కోఆర్డినేటర్లను నియమిస్తామన్న సీఎం
జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్న సీఎం జగన్‌
మంత్రివర్గాన్ని కూడా పునర్‌ వ్యవస్థీకరిస్తాం: సీఎం జగన్
26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తాం: సీఎం

కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాం: సీఎం జగన్‌
దీని వల్ల మనం గర్వంగా ప్రజలకు దగ్గర వెళ్లగలం: సీఎం
టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న సీఎం జగన్‌
మనం చేస్తున్న యుద్ధం చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, tv-5తో కూడా: సీఎం జగన్‌
వీరింతా ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు: సీఎం
ఎప్పటికప్పుడు మనం వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం జగన్‌…

Leave a Reply