– స్కూల్ పిల్లలకు అందాల పోటీలు చూపించాలి అని సిగ్గులేకుండా సి.ఎం చెబుతున్నాడు
– ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా దేశంలో రేవంత్ రెడ్డి కి మొదటి బహుమతి
-రాష్ట్రం దివాళా తీసింది అని రాష్ట్రం పరువు తీసేలా మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో ఎవడు లేరు
– నువ్వు 17 నెలల్లో చేసిన 1 లక్ష 60 వేల కోట్ల అప్పులతో ఒక్క ఇటుక అయిన పేర్చి అభివృద్ధి పని చేశావా ?
– ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మార్చి పార్టీలో ఇంకొకరికి అవకాశం ఇవ్వండి అని రాహుల్ గాంధీ కి సూచిస్తున్న
– జిల్లాలో ధాన్యం కొనుగోలు సమస్య తీవ్రంగా ఉంది సమస్యను వెంటనే పరిష్కరించి రైతులను ఆదుకోవాలి.
– కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు CDP నిధులు ఇవ్వడం లేదు.
– మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్పల్లి : అందాల పోటీలు కాదు ఫెయిల్యూర్ సీఎం ల పోటీ పెట్టండి. దేశంలో నంబర్ వన్ ర్యాంక్ రేవంత్ రెడ్డికి రావడం ఖాయం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల పంట పడితే 10 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ చేయాల్సిన అంచనా పెట్టుకుంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి అని అన్నారు.
సన్న వడ్లు తీసుకోవడంలో రైస్ మిల్లర్లు నిరాసక్తత చూపించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని,9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్ లకు వస్తే 6 లక్షల 95 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు అని ఎమ్మెల్యే అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇంకా 2లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి అంటే 20 శాతం ధాన్యం జోకకుండా కల్లాల్లోనే ఉంది.
లారీలల్లో 6 ,94,000 మెట్రిక్ టన్నులు లోడ్ చెసి రైస్ మిల్స్ కి పంపించగా 5,56,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఆన్ లోడ్ చేశారు అని ఇంకా 1 లక్ల 38 వేల మెట్రిక్ టన్నులు లారీల్లో ఉన్నాయి. రైస్ మిల్లర్లు దించుకోవడం లేదు అని ఎమ్మెల్యే అన్నారు.జిల్లాలో ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నులు తరుగు కింద తీసేసారు.ఒక క్వింటాలుకు 5 కిలోల తరుగు తీస్తున్నారు.
లారీలల్లో ధాన్యం అన్ లోడ్ చేయాలి,కల్లాల్లో ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి , వడ్లకు దేశ వ్యాప్త డిమాండ్ ఉంది కావున అధికార యంత్రాంగం వెంటనే కొనుగోలు చేసి, తరుగు అరికట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలుపై రివ్యూ చేయడం లేదు. అందాల పోటీలపై రివ్యూ చేస్తున్నాడు. రైతుల కంటే అందాల పోటీలపైనే రేవంత్ రెడ్డి కి ఆశక్తి ఉంది అని ఎద్దేవా చేశారు స్కూల్ పిల్లలకు అందాల పోటీలు చూపించాలి అని సిగ్గులేకుండా సి.ఎం చెబుతున్నాడు.
అందాల పోటీలు కాదు ఫెయిల్యూర్ సీఎం ల పోటీ పెట్టండి. రేవంత్ రెడ్డి కి దేశంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా నెంబర్ వన్ ర్యాంక్ రావడం ఖాయం అని ఎమ్మెల్యే అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి అంటే నన్ను కోసుకొని తినుమంటున్న రేవంత్ ముఖ్యమంత్రిగా అనర్హుడు అని, పరిపాలన చేతకాకపోతే దిగిపో మీ పార్టీలో శ్రీధర్ బాబు, ఉత్తమ్, బట్టి లాంటి నీకన్న అర్హులు ఉన్నారు అని ఎమ్మెల్యే అన్నారు.
అధిష్టానం వెంటనే రేవంత్ ను దించాలని లేకుంటే మరో 20 ఏండ్లు కాంగ్రెస్ ఖతం కావడం ఖాయం అని రాహుల్ గాంధీ కి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి లెక్కలేని హామీలు ఇచ్చాడు. ఆర్రాస్ పాడినట్లు హామీలు చదివాడు. ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చలేదు.
అరకొర రైతు రుణమాఫీ, బోనస్ ఎగవేత, రైతు బంధు సరిగా లేదు. మహిళలను మోసం చేశారు. రూ. 2500 ఇవ్వలేదు,తులం బంగారం ఎగ్గొట్టావు, 4 వేల పింఛన్ లేదు, రూ. 5 లక్షల విద్యా భరోసా ఇవ్వలేదు. స్కూటీలు జాడ లేదు.రేషన్ కార్డు ఊసే లేదు. కొత్త పింఛన్ ముచ్చట లేదు అని ఎమ్మెల్యే విమర్శించారు.
ఈ సీజన్ మొదలై 40 రోజులయ్యింది ఇప్పటికి ఒక్క రైతుకు కూడా బోనస్ ఇవ్వలేదు. వెంటనే క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయినందుకు రాష్ట్రంలో ఫెయిల్యూర్ సీఎం పోటీలు పెడితే దేశంలో రేవంత్ రెడ్డి కి మొదటి స్థానం వస్తుంది అన్నారు.
కేసీఆర్ 10 ఏళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అప్పులు చేసి, 24 గంటల విద్యుత్తు,కాళేశ్వరం ప్రాజెక్ట్,మిషన్ భగీరత ద్వారా ఇంటింటికి నీరు, సెక్రటేరియట్,33 కలెక్టరేట్లు, 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం,అమరవీరుల స్తూపం,33 మెడికల్ కాలేజీలు,హాస్పిటల్స్, రైతు బంధు ఇలా అనేక అభివృద్ధి పనులు చేసాడు. ఆస్తులు సృష్టించాడు.
17 నెలల్లో 1లక్ష 60 వేల కోట్ల అప్పు రేవంత్ చేశాడు. అప్పులు చేసి ఢిల్లీకి మూటలు పంపిస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క ఇటుక అభివృద్ధి పని అన్న చేశావా ? అని ప్రశ్నించారు. కాగ్ లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు వడ్డీ కలిపి కట్టింది 34 వేల కోట్లు మాత్రమే.నువ్వు చేసిన అప్పులో అసలు వడ్డీ కట్టగా మిగిలిన 1,20,000 కోట్లు ఎం చేసావు ? అప్పుల విషయంలో తప్పుడు లెక్కలతో కేసీఆర్ పాలనపై రేవంత్ రెడ్డి నిందలు వేస్తున్నారు.
కోసుకొని తినుండ్రి, చెప్పులు ఎత్తుక పోయేవాళ్ళ లెక్క చూస్తుండు,నన్ను ఎవడు నమ్ముతలేడు, రాష్ట్రం దివాళా తీసింది అని చెప్పే ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని మార్చండి. రేవంత్ ను మార్చకపోతే కాంగ్రెస్ సమాధి కావడం ఖాయం అని ఎమ్మెల్యే అన్నారు.