కొహెడ : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ టూరిస్టుల పై ఉగ్రవాదుల దాడి కి నిరసనగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది. భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాల పై చేసిన దాడి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పై గట్టి చప్పట్ల తో అభినందనలు తెలుపుతున్న. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్న.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు అన్ని పార్టీల నాయకులు ఈ చర్యను సమర్థిస్తున్నాయి. హుస్నాబాద్ లో ప్రజలు కూడా సంబరాలు చేస్తున్నారు. ప్రజలందరూ ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్నాం. వారికి మానసిక దైర్యం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాం.