వికేంద్రీకరణ కాదు.. విధ్వంసమే జగన్ నిర్ణయాలు

– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి

విజయవాడ : ముఖ్యమంత్రి జగన్ చేయాలనుకుంటున్నది పరిపాలన వికేంద్రీకరణ కాదని, పరిపాలనతో విధ్వంసం చేయడమేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ఆరోపించారు. అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలంటే పాలన వికేంద్రీకరణే చేయాలా? అని ఆయన ప్రశ్నించారు.

దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అలాగే చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే తగిన ప్రణాళికలు అమలుచేసి అన్ని ప్రాంతాలనూ ప్రగతిబాటలో నడిపించే వారని అన్నారు. అధికార వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించాలని, ఇలాంటి ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టి పరిపాలన, శాసన,న్యాయ రాజధానులను వేర్వేరుచోట్ల పెట్టి ఏంసాధించాలనుకుంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు.

హైకోర్టు తీర్పు పై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకి వెల్గొచ్చు. ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోరు? ఇదే ప్రభుత్వం గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భాలున్నాయి కదా, అంత ధైర్యం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లేచ్చుగా? అని తులసి రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply