రూ.200 పెట్రోల్ కొట్టిస్తే ఒక లీటరు బాటిల్ కూడా నిండలేదు

– బర్మా భారత్ పెట్రోల్ బంక్ లో వాహనదారులు ఆందోళన
– బంక్ యాజమాన్యం మోసాలపై ఫిర్యాదు చేస్తా

హైదర్ గూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ మెయిన్ రోడ్ లో ఉన్న బర్మా భారత్ పెట్రోల్ బంక్ లో వాహనదారులు ఆందోళన చేశారు. బంక్ లో లీటరుకు పావులీటర్ కు పైగా పెట్రోల్ తక్కువ పోస్తున్నారని యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే అప్రమత్తమైన బంక్ యాజమాన్యం తమ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాహనదారులపై ఎదురుదాడి ప్రయత్నం చేసింది. పదిమంది సిబ్బందితో వాహనదారులతో గొడవ చేయించింది.

రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే ఒక లీటరు బాటిల్ కూడా నిండలేదని ఓ మహిళా వాహనదారు ఆరోపించారు. పెట్రోల్ తక్కువ రావడంపై బంక్ నిర్వహులను నిలదీశారు. అయితే యజమాని సిబ్బంది

కలిసి మహిళతో వాగ్వివాదానికి దిగడంతో, తనపై జులుం ప్రదర్శింస్తున్నారని సంబంధిత అధికారులకు పెట్రోల్ బంక్ యాజమాన్యం మోసాలపై ఫిర్యాదు చేస్తానని అక్కడినుండి వెళ్లిపోయారు.

Leave a Reply