వికలాంగుడైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కు ఎన్ఆర్ఐ టిడిపి ఖతర్ ఆర్థిక సహాయం

తెనాలి వాస్తవ్యుడు గాదె శశి భూషణ రావు అనే వికలాంగుని కి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కృత్రిమ కాలు కొరకు అప్పటి మంత్రి నక్క ఆనంద్ బాబు కృషితో అప్పటి ముఖ్య మంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షలు మంజూరు చేయగా ఐదు సంవత్సరాల క్రితం కృత్రిమ కాలు పెట్టించుకున్నారు.

అప్పటి నుంచి అతను సక్రమంగా నడుస్తూ తన పని తాను చేసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఈ కృత్రిమ కాలు రిపేరు రావడం వల్ల తన సొంత పని కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. దీని రిపేరుకు ₹40 వేల ఖర్చు అవుతుంది.

దీన్ని రిపేర్ కొరకై ఎన్ఆర్ఐ టిడిపి వారు ఖతర్ లోని ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షులు గొట్టిపాటి రమణ అక్కడి సభ్యులైన దాసరి రమేష్ కి తెలుపగా వారు దీనికి అయ్యే ఖర్చు మొత్తం ఇస్తానని తెలిపి పంపించడం జరిగింది.

ఈ మొత్తాన్ని ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంగళగిరిలో మాజీ మంత్రివర్యులు నక్క ఆనందబాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మీడియా ఇంచార్జి దారపనేని నరేంద్ర ఎన్నారై టిడిపి కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ద్వారా అందించడం జరిగింది.ఈ సందర్భంగా అడిగిన వెంటనే ఆర్థిక సహాయం అందించిన ఖతర్ సభ్యులను నాయకులందరూ అభినందించారు.

Leave a Reply