5న నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈనెల 5 వ తేదీన నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, MLA మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా TRS పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల 5 వ తేదీ దసరా రోజు TRS పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పారు. సమావేశం అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద, నగరంలో ని అన్ని నియోకాకవర్గాలు, డివిజన్ లలో భారీ ఎత్తున సంబరాలు జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, MLC సురభి వాణిదేవి, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, సాయన్న, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, ఆయాచితం శ్రీధర్, గజ్జెల నగేష్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, పలువురు కార్పొరేటర్ లు, నియోజకవర్గ ఇంచార్జి లు పాల్గొన్నారు.

Leave a Reply