Suryaa.co.in

Telangana

అర్హులందరికీ పెన్షన్లు, సంక్షేమ పధకాలు

– ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడి

మెట్టుగూడ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
సికింద్రాబాద్ పరిధిలో లబ్దిదారుల ఇళ్లకే చేరుకొని ఆసరా పించన్ల కార్డులను అందించే పద్దతిని చేపడుతున్న ఉప సభాపతి పద్మారావు గౌడ్ శుక్రవారం మెట్టుగూడ డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. కార్పొరేటర్ రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, ఎమ్ ఆర్ ఓ మాధవి, యువ నేతలు కిషోర్ కుమార్, రమేశ్వర్ గౌడ్, అధికారులు, నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సికింద్రాబాద్ పరిధిలో అర్హులిన్ వారికి అన్ని ప్రయోజనాలు వర్తించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. తన పర్యటనలో భాగంగా పలు సమస్యలను గుర్తించి అప్పటికప్పుడే వాటి పరిష్కారానికి ఏర్పాట్లు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెట్టుగూడ, అయ్యప్ప టెంపుల్, గోవింద్ పురం, ఆలుగడ్డ బావి, వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటన సాగింది. మెట్టుగూడ పార్క్ ను వెంటనే అభివృద్ధి చేసి, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను తొలగించాలని అయన ఈ సందర్భంగా ఆదేశించారు.

LEAVE A RESPONSE