ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా ప్రజలు గుర్తించాలి

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ప్రిజనరీ కి విజనరీకి ఉన్న తేడా ప్రజలు గుర్తించాలి.ప్రిజనరీ వ్యవస్థల నాశనం గురించి ఆలోచిస్తే…, విజనరీ భావి తరాల బాగు కోరుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ అయితే చంద్రబాబు విజనరీ.
రోడ్ల మీద గుంతలు పూడ్చలేని వాడు మూడు రాజధానులు కడతాడా?ఈ నెల 29న ప్రజాక్షేత్రంలో కి తెలుగుదేశం నేతలు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడతాం.చట్ట సభల్లో మా గొంతు నొక్కినా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను వదిలిపెట్టo.

రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థ పై దాడికి దిగలేదు.మూర్ఖుడు కాబట్టే జగన్ రెడ్డి న్యాయ వ్యవస్థపై నే దాడికి దిగారు. భూమిని త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.అమరావతిలో నిర్మాణం పూర్తైన భవనాల దగ్గర జగన్ రెడ్డి కనీసం మౌలిక వసతులు
lk3 కూడా పూర్తి చేయలేదు.45గంటల పాటు సాగిన సభలో సారా మరణాలపై కనీసం 45 నిమిషాలు పాటు చర్చించలేరా?సీఎం జగన్ ఎంత త్వరగా విశాఖ వెళ్లి కూర్చొంటే మాకు మరిన్ని సీట్లు పెరుగుతాయి. ఇప్పటికే విశాఖలో అరాచకం.. భూకబ్జాలు పెరిగాయి.. సీఎం వెళ్తే మరింతగా పెరుగుతాయి.విజయసాయి దెబ్బకు ఇప్పుడు విశాఖలో అందరూ భయపడుతున్నారు.. రేపు సీఎం వెళ్తే ఇంకా భయపడతారు.

1200 గజాల భూమి ఉన్న ప్రతి విశాఖ వాసి గజగజలాడుతున్నాడు.అభివృద్ధి వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి.పరిపాలనా వికేంద్రీరణ అంటే పరిపాలనా విధ్వంసమే.అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది మేమే. టీడీపీ హయాంలో వచ్చిన 5.40 లక్షల ఉద్యోగాలు అన్ని జిలాల్లో వచ్చాయి.మా లక్ష్యానికి అనుగుణంగా ఆటోమొబైల్ అనంతపురం, ఖనిజాలు, సోలార్ కంపెనీలు కర్నూలు, ఐటీ విశాఖ, ఎలక్ట్రానిక్స్ చిత్తూరు జిల్లాల్లోకి తెచ్చాం. మేం తెచ్చిన వాటిని కంటిన్యూ చేసినా చాలా పరిశ్రమలు వచ్చుండేవి.వచ్చీ రావడంతోనే పీపీఏల రద్దు అంటూ ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పుట్టించారు.

పీపీఏల రద్దు కారణంగా సుజలాన్ అనే అతి పెద్ద కంపెనీ దివాళ తీసింది.. అందులో పెట్టుబడులు పెట్టిన చాలా పెద్ద పెద్ద కంపెనీలు దెబ్బతిన్నాయి.పీపీఏల రద్దు నిర్ణయంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు జంకుతున్నాయి.మేం చేసుకున్న ఒప్పందాలు కంటిన్యూ చేసి ఉంటే విశాఖలోనే అదానీ డేటా
lk సెంటర్ ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు, 70 వేల ఉద్యోగాలు వచ్చేవి..విశాఖ రూపు రేఖలే మారేవి.ఏమీ చేయలేని తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే సీఎం జగన్ మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నారు.రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేని వాళ్లు మూడు రాజధానులు కడతారా..?ఇన్ని మాట్లాడుతోన్న జగన్.. అమరావతే రాజధాని అని నిర్ణయం జరిగిన రోజు.. విశాఖలోనో.. విజయవాడలోనో రాజధాని పెడదామని ఎందుకు చెప్పలేకపోయారు..?ఆ రోజు అమరావతికి మద్దతు పలికి.. ఇవాళ కాదనడం మోసం కాదా..?తమ శాఖ అధికారులు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారని.. ఏ పని కావడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. అన్ని ఓ చోట ఉన్నప్పుడే పనులు కానప్పుడు.. మూడు వ్యవస్థలు మూడు చోట్ల ఉంటే పనులెలా అవుతాయి?

రాజధానుల వల్లే అభివృద్ధి జరుగుతుందంటే.. 175 నియోజకవర్గాల్లో 175 రాజధానులు పెట్టొచ్చుగా..? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారితే ప్రజల పరిస్థితేంటీ..? ఏపీ ఆర్ధిక పరిస్థితి శ్రీలంక ఆర్ధిక పరిస్థితితో సమానంగా ఉంది.పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఏదో రోజు ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వస్తుంది.

ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తే బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బు, బంగారాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. నాణ్యత లేని మద్యం వల్ల 42 మంది ప్రాణాల పోయాయి.. అందుకే సభలో పోరాడాం. మా పోరాటం వల్లే సీఎం నోరు విప్పారు. నాన్న బుడ్డి వల్లే అమ్మ ఒడి ఇవ్వగలుగుతున్నామని బహిరంగంగా చెప్పారు.ఈ ప్రభుత్వం మద్యం మీదే మనుగడ సాగిస్తోందని సీఎంతోనే చెప్పించడం మేం సాధించిన విజయం.

Leave a Reply