పీకే కేసీఆర్‌ పర్యటన…ఆసక్తిగా మారిన సీఎం భేటీ

రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్… సీఎం కేసీఆర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ ఆలోచనలు, వ్యాఖ్యలపై పీకే బృందం వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ అభిప్రాయాలు సేకరిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన వేళ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్ర పర్యటన ఆసక్తి రేపుతోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్… సీఎం కేసీఆర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, కేసీఆర్ ఆలోచనలు, వ్యాఖ్యలపై పీకే బృందం వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ అభిప్రాయాలు సేకరిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్… సంబంధిత అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

ఇటీవల ముంబయి పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చల సారాంశం, తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు చెప్తున్నారు. అటు సినీనటుడు ప్రకాశ్‌ రాజ్ కూడా గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రశాంత్ కిషోర్, ప్రకాశ్‌ రాజ్ ఇరువురూ మల్లన్నసాగర్ జలాశయం, పంప్ హౌస్ సహా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా వర్గాల అభిప్రాయాలను కూడా ప్రశాంత్ కిషోర్ తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply