* ప్రపంచ శాంతి కోసం విశేషంగా కృషి
* ఆయన జీవితం యావత్ సమాజానికి స్ఫూర్తి
* తెలంంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్; క్రైస్తవ ఆధ్యాత్మిక బోధకుడు పోప్ ఫ్రాన్సిస్ మరణించారనే విషయం యావత్ సమాజానికి తీరని లోటని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, పేదల పట్ల ప్రేమ, శరణార్థుల హక్కులు, మరియు మహిళల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సమాజంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తినిచ్చిందన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన వారసత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ మత సామరస్యానికి ప్రాధాన్యం ఇచ్చారని ఇతర మతాధిపతులతో శాంతి సమావేశాలు నిర్వహించారని గుర్తు చేశారు.
కాథలిక్ చర్చిలో ప్రముఖ వ్యక్తిగా, పోప్ ఫ్రాన్సిస్ చాలా సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. 2013 మార్చి 13న చరిత్రలో తొలిసారిగా లాటిన్ అమెరికా నుండి ఎన్నికైన పోప్గా, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారన్నారు.