Suryaa.co.in

National

ప్రశాంత్ కిశోర్ ఆమరణ దీక్ష

పాట్నా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిశోర్ ఆమరణ దీక్ష చేపట్టారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఆయన దీక్ష చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను మళ్లీ నిర్వహించాలని పరీక్షలు రాసిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. పరీక్షలను మళ్లీ నిర్వహించే ప్రసక్తేలేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో, గత రెండు వారాలుగా పరీక్షలు రాసిన అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి మద్దతుగా ఆమరణ దీక్ష చేపట్టారు. ప్రిలిమినరీ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE