Suryaa.co.in

National

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పై ప్రధాని మోదీ కుట్ర

కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంపై దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ ఖర్గే, మాజీ చీఫ్‌ సోనియా, రాహుల్‌ గాంధీ లతో పాటు సీనియర్‌ నేతలు మాట్లాడారు. లోక్‌ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందులకు గురి చేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంపై గురువారం తొలిసారిగా స్పందించిన సోనియా. ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా పార్టీ ఫండ్స్‌ ను కట్టడి చేయడం సరికాదని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీని ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో సిస్టమేటిక్‌ గా వ్యవహరించారంటూ మోదీని దుయ్యబట్టారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ మాజీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ కూడా మోదీపై ఇవే ఆరోపణలు గుప్పించారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా దేశంలో పెద్ద మొత్తంలో లబ్ది పొందిన పార్టీ ఏదనేది అందరికీ తెలుసని చెప్పారు. ఈ మేరకు గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడాన్ని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టడం కష్టమని పార్టీ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ మండిపడ్డారు.

LEAVE A RESPONSE