Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత

– అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యను లేవనెత్తుతాం
– బి ఆర్ ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది
– బి ఆర్ ఎస్ పోరాడే తత్వాన్ని కోల్పోలేదు
– బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: వచ్చే ఏప్రిల్ నెలతో బిఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. గత సంవత్సరం బిఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలం. సంవత్సరం కాలంలో
ఏం జరిగిందో షార్ట్ ఫిల్మ్ ద్వారా రసమయి బాలకిషన్ చూపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయాము.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఎమ్మెల్సీ కవితను ఐదు నెలలు జైల్లో పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఒక్కరు గెలవరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది.
నేడు గాంధీ భవన్ బోసిపోయింది. తెలంగాణ భవన్ నిత్యం కళకళలాడుతోంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని ఆశా వర్కర్లు కలిశారు. ప్రజలకు సూటిగా సుత్తి లేకుండా అర్ధం అయ్యే విధంగా రసమయి షార్ట్ ఫిల్మ్ తీశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యను లేవనెత్తుతాం. బి ఆర్ ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది. బి ఆర్ ఎస్ పోరాడే తత్వాన్ని కోల్పోలేదు. బిఆర్ఎస్ పార్టీపై ప్రజలకు అభిమానం తగ్గలేదు.

LEAVE A RESPONSE