– బిహార్లో కాదు.. హైదరాబాద్లో దొంగ ఓట్లు తనిఖీ చేయండి
– దొంగఓట్లతో జూబీహిల్స్లో దొడ్డిదారి గెలుపు కోసం ఓటు చోరీ
– 20వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ లో నమోదు
– ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు
– ఒక్కొక్క వ్యక్తికి మూడు, మూడు ఎన్నికల గుర్తింపు కార్డు
– ఒక చిన్న ఇంట్లో 100కు పైగా ఓట్ల నమోదు
– ఈసీకి కాంగ్రెస్ దొంగఓట్ల బాగోతాన్ని ఆధారాలతో సహా అందించిన మాజీ మంత్రి కేటీఆర్
– జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఇతర అవకతవకల పైన వినతిపత్రం సమర్పించిన అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్
హైదరాబాద్: రాహుల్ గారూ.. బీహార్ ఎన్నికల్లో మీరు ఓటు చోరీ గరించి ఇల్లుపీకి పందిరేసి గత్తర చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని మీడియాలో ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్ల ఏరివేతను మేమూ సమర్థిస్తాం. కానీ మీరు మా తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం-పార్టీ కలసి చేస్తున్న ఓటు చోరీ గురించి స్వయంగా వచ్చి తెలుసుకోండి.
మా వెంట వస్తే ఓటు చోరీ చేస్తుందెవరో చూపిస్తాం. ఆధారాలు ఇప్పటికే ఈసీకి సమర్పించాం. దమ్ముంటే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోమని మీ సీఎం రేవంత్రెడ్డికి చెప్పండి. మీరు బీహార్లో ప్రవచనాలు చెప్పడం ఆపి, హైదరాబాద్ వస్తే మీ ఓటు చోరీ నినాదంలో మీ చిత్తశుద్ధి ఏమిటన్నది తెలుస్తుంది.
జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే… చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. 400 ఎన్నికల బూత్ లో కనీసం 50 దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది. ఇట్లా కనీసం 20వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించింది. ఒక్కొక్క వ్యక్తికి మూడు, మూడు ఎన్నికల గుర్తింపు కార్డులో ఉన్నాయి. ఒకటే అడ్రస్ తో మూడు ఓట్లు నాలుగు ఓట్లు ఒక్కొక్కరు నమోదు చేయించుకున్నారు
ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడి లో ఉన్నాయి.
ఒకటే వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి అనేకసార్లు ఓట్ల నమోదు చేయించడం జరిగింది. ఈరోజు మేము లేవనెత్తుతున్న ప్రతి అంశం కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నది. కేవలం మా పార్టీకి ఇప్పటిదాకా దృష్టికి వచ్చినవి 20,000 డూప్లికేట్ దొంగ ఓట్లు. ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలి. ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు జరిగింది. ఆయా ఇళ్లకు సంబంధించి మేము వెళ్లి చూస్తే , ఒకటే ఒక చిన్న ఇంట్లో 100కు పైగా ఓట్ల నమోదు కూడా జరిగిన సందర్భాలు వందల సంఖ్యలో ఉన్నాయి
15 వేల ఓట్లు కేవలం ఈ విధంగా చిరునామాలు లేకున్నా ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది. మా పార్టీ నేతలు ఆయా ఇంట్లోకి వెళ్లి చెప్తే , 23 ఓట్లు ఉన్న ఇంటి యజమాని వాటిలో ఒకటి కూడా మా వాళ్ళు లేరని చెప్పారు. అసలు ఈ ఓట్లతోనే మాకు సంబంధం లేదు. వీటితో మాకు సంబంధం లేదని చెప్పారు. అసలు కిరాయి ఇవ్వకముందే ఇలాంటి పేర్లు ఎట్లా రాశారు అని ఆయన మాకు చెప్పారు.
జూబ్లీహిల్స్ పైనికలో కాంగ్రెస్ పార్టీ ఎట్లన్న గెలవాలని అన్ని అడ్డగోలుదారుల్లో ప్రయత్నం చేస్తుంది. సామ,దాన, దండోపాయాలతో ప్రయత్నం చేస్తుంది. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
నిధులు లేవని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ బ్యాంకు కి, వార్తా పత్రికలకు లేఖలు రాస్తున్న సందర్భంగా, జూబ్లీహిల్స్ లో మాత్రం భారీగా నిధులు ఉన్నాయని ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి అధికార దుర్వినియోగంతో పాటు, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నం పైన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం.
జూబ్లీహిల్స్ లో ఓట్లు ఉన్నవాళ్లకి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, తమ ఓట్లు డిలీట్ చేయకుండా ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వారిని కూడా జూబ్లీహిల్స్ లో రాయించారు. ఇట్లా వివిధ కారణాలతో వేల కోట్లను దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లుగా రాయించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంలో సరైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కలిశాం.
స్పష్టంగా మూడు డిమాండ్లు వారి ముందు ఉంచారు. మా అనుమానం ప్రకారం సుమారు 20000 ఓట్లు దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉన్నాయని ఆయనకు వివరించాము. దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా మా అనుమానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కు దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానం ఉన్నది.
ఈ మొత్తం ఓటర్ లిస్టు అవకతవకల పైన వాటిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి అని డిమాండ్ చేసాం. క్షేత్రస్థాయిలో కుమ్మకు అయిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి వారిని వెంటనే బదిలీ చేయాలని కోరాం.
12000 ఓట్లను వివిధ కారణాలతో తొలగించిన తర్వాత కూడా అదనంగా 7000 కొత్తగా చేరాయని మొత్తంగా డిలీట్ చేసినవి కొత్తగా చేరినవి కలిపితే సుమారు 19 కొత్త ఓట్లు కాంగ్రెస్ పార్టీ దొంగతనంగా చేర్చింది. ఈ అంశంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తగిన సమాధానం ఇస్తామని చెప్పింది. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం.
