Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా పక్షపాతి రామోజీరావు

– శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు స్వయం కృషి తో అత్యంత ఉన్నత స్థితి కి చేరి తెలుగు వారి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు. రామోజీరావు ఈ రోజు అంతిమ శ్వాస విడవడం అత్యంత విచారకరం.

ఈనాడు పత్రికతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారు. ప్రజా పక్షపాతిగా, , జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమస్ఫూర్తితో పని చేశారు.

అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తూ..వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

LEAVE A RESPONSE