Suryaa.co.in

Andhra Pradesh

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయండి

– యువనేత లోకేష్ కు సమగ్రశిక్షా ఎంప్లాయిస్ ఫెడరేషన్ విజ్ఞప్తి

విశాఖపట్నం: రాబోయే ప్రజాప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సమగ్రశిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు యువనేత లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

విశాఖ నార్త్ శంఖారావం సభకు ముందు వారు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐసి కోఆర్డినేటర్లు, మండల లెవల్ అకౌంటెట్స్, మెసెంజర్స్, సిఆర్ఎంటిలు, సహిత విద్యా రిసోర్స్ పర్సన్లు, భవిత ఆయ, ఫిజియోథెరపిస్టులు, హైస్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది, కస్తూరిబా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది, రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 25వేలమంది ఉన్నారు.

ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకుండా తక్కువ వేతనాలతో పనిచేస్తూ పెరిగిన ధరలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్ సదుపాయం లేదు. సమగ్రశిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు పెన్షన్ సదుపాయం కల్పించాలని వారు కోరారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్రశిక్షా కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై ఆయా సంఘాలతో చర్చించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE