హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు అసంబద్ధం

-సిఎం జగన్ మనిషి అయితే మారాలి
-వర్సిటీకి చాన్స్ లర్ గా ఉన్న గవర్నర్ కు కూడా తెలియకుండా బిల్లు
-బిల్లు రిజక్ట్ చెయ్యమని గవర్నర్ ను కోరాం
-రాజ్ భవన్ వద్ద మీడియా తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని ఒక చీకటి చట్టం తెచ్చారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్image-6 ఆర్ పేరు పెట్టడంపై చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అసంబద్దంగా, అనైతికంగా ఉన్న బిల్లును రిజెక్ట్ చెయ్యాలని గవర్నర్ ను కోరారు.

అనంతరం రాజ్ భవన్ వద్ద మీడియాతో టిడిపి అధినేత మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని అత్యవసరం గా, హడావుడిగా చట్టాన్ని తెచ్చారు. రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక ముద్ర ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. అన్ని మెడికల్ కళాశాలలను ఒక యూనివర్సిటీ కిందకు తేవాలని 1986 లో హెల్త్ వర్సిటీ తెచ్చారు. ఎన్టీఆర్ మరణానంతరం1998 లో మేము NTR పేరు వర్సిటీ కి పెట్టాము. వైద్య రంగంలో పెనుమార్పులకు కారణం అయిన ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీకి పెట్టాము.

డాక్టర్ కాకర్ల సుబ్బారావు వంటి వారికి అమెరికా నుంచి తీసుకువచ్చి నిమ్స్ ను అభివృద్ధి చేసిన చరిత్ర ఎన్టీఆర్ ది. 24 ఏళ్లలో వేల మంది ఈ యూనివర్సిటీ అనుబంధ వైద్య కళాశాలల ద్వారా వైద్య విద్య అభ్యసించారు. నేను సిఎంగా ఉన్నప్పుడు తక్కువ మెడికల్ కాలేజ్ లు ఉన్నాయి. వాటిని పెంచాలని కేంద్రంతో సమన్వయం చేసుకున్నాం. రాష్ట్రం లో 32 మెడికల్ కాలేజీలు ఉంటే 18 టీడీపీ హయాంలోనే వచ్చాయి.

13 ప్రైవేటు, 5 ప్రభుత్వ కాలేజీలు మా హయాంలో వచ్చాయి. అసెంబ్లీ లో ఇన్ని అసత్యాలు చెప్పిన సీఎం ను చూడలేదు. 8వ సారి నేను అసెంబ్లీలో ఉన్నాను. చట్టసభలో అబద్దాల కోరు గా సీఎం వ్యవహరించారు. మంత్రి అయినా ఎవరైనా సభకు ప్రిపేర్ అయ్యి…బాద్యతగా చెపుతారు. రాజ్యాంగపై ప్రమాణం చేసి చట్ట సభలో కూర్చుంటాం. అలాంటి చట్ట సభలో కూర్చున్న సిఎం అబద్దాలు చెప్పారు. నేను కాలేజ్ లు పెట్టానో లేదో చిన్నపిల్లలను అడిగినా చెపుతారు.

జగన్ పాలనలో మూడున్నరేళ్లకు మూడు కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. వాటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కనీసం గోడలు కూడా పూర్తి చెయ్యలేదు. రాష్ట్రానికి ఎయిమ్స్ తీసుకువస్తే కనీసం నీటి సరఫరా చెయ్యలేదు. ఎయిమ్స్ కు 190 ఎకరాల భూమి ఇచ్చాం…అన్ని పనులు చేశాం. కానీ ఈ ప్రభుత్వం దానిపైనా అసత్యాలు చెపుతోంది. వర్సిటీకి NTR పేరు తీసెయ్యాలి అనే ఆలోచన, మనసు ఎలా వచ్చింది. పేరుమార్పుపై సిఎం ఎవరితో మాట్లాడారు…ఏ ఆత్మతో మాట్లాడారో తెలీదు.

NTR కు వైఎస్సార్ తో పోలిక ఏంటి? ఏ అంశంలో ఎన్టీఆర్ తో రాజశేఖర్ రెడ్డిని పోలుస్తారు. NTR కంటే వైఎస్సార్ గొప్ప అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. NTR శతజయంతి సమయం లో వర్సిటీకి పేరు తీసేస్తారా? కొత్త మెడికల్ కాలేజ్ కట్టి మీ పేరు పెట్టుకో. మెడికల్ కౌన్సిల్ మీకు అనుమతి ఇచ్చిందా? వర్సిటీ కి గవర్నర్ ఛాన్సలర్ గా ఉన్నారు…గవర్నర్ ను అడిగారా? ఇది గవర్నర్ కు అవమానం కాదా అని అడిగాము. పేర్లు ఉన్నపళంగా మార్చడం అనేది పిచ్చివాళ్ల పని. మళ్ళీ NTR పేరు పెట్టే వరకు పోరాటం. రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజ్ లు ఉన్నాయి. ఎవరి హయాంలో ఎన్ని వచ్చాయో సమాచారం తెప్పించుకోవాలి. ఎవరి హయాం లో ఏమీ వచ్చాయి అనేది వైసీపీ నేతలు కూడా చూడాలి.

తప్పును తప్పు అని చెప్పక పోతే ఎలా ఎమ్మెల్యేలు,మంత్రులు అవుతారు. టిడిపి హాయంలో వైద్య శాఖలో అనేక కార్యక్రమాలు చేపట్టాము. తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ నుంచి మహా ప్రస్థానం వాహనం వరకు తెచ్చాం…ఇప్పుడు కుప్పం ఆసుపత్రిలో కనీసం అన్నం పెట్టడం లేదు. మెడ్ టెక్ పార్క్ లాంటి దాన్ని భ్రష్టుపట్టించారు. చట్టసభల్లో అబద్దాలు చెప్పే ఇలాంటి వాళ్ళు సీఎంగా కాదు….రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. రాజకీయాల్లో వ్యక్తిగతం గా ఏమీ ఉండదు. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. రాజకీయంగా విభేదించి మర్రి చెన్నారెడ్డితో హోరాహోరీ గా పోరాడాను.

కానీ నేను సిఎం అయిన తరువాత ఆయన పేరుతో ఒక మెమోరియల్ కట్టించాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి చనిపోతే ఆయన పేరుతో ఒక స్టేడియం కట్టించాను.జగలం వెంగళరావు పేరుతో పార్క్, కాసు బ్రహ్మానంద రెడ్డిపేరుతో పార్క్ అభివృద్ది చేశాం, కృష్ణ కాంత్ పేరుతో పార్క్ పెట్టాం. NTR పేరు మార్చడం సరికాదని స్వయం గా నీ చెల్లెలు చెప్పింది. రక్తం పంచుకుని పుట్టిన నీ చెల్లెలు మీ తండ్రి పేరు పెడితే ఇది సబబు కాదు అని చెప్పింది. నువ్వు మనిషివైతే మారాలి.

అసవరం అయితే కొత్త కాలేజీలు కట్టి, యూనివర్సిటీలు తెచ్చి పేరు పెట్టుకో. దీని వల్ల ఇమేజ్ పెరగదు. బిల్లును రిజక్ట్ చెయ్యమని గవర్నర్ ను కోరాం. అనైతికం, చట్ట వ్యతిరేకం అని గవర్నర్ కు తెలిపాం. 9 కోట్ల మంది తెలుగు వారిని అవమానం చేసినట్లు. బిల్లు తెచ్చిన విషయం తనకు తెలియదని గవర్నర్ తెలిపారు. చాన్స్ లర్ గా ఉన్న గవర్నర్ కు కూడా తెలియకుండా బిల్లు తెచ్చారు. కేంద్ర స్థాయిలో పోరాడుతాం.లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. ఒక్క సారిగా పేరు మార్పుతో బ్రాండ్, క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. జగన్ యూనివర్సిటీ నిధులు కూడా దోచేశారు….కనీసం స్నాతకోత్సవం జరుపు కోవడానికి కూడా నిధులు లేకుండా చేశారు. జగన్ చేసింది నీచాతినీచం, అతిపెద్ద తప్పు అని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉందన్న చంద్రబాబు
అంతకుముందు పార్టీ నేతలతో కలిసి టిడిపి అధినేత గవర్నర్ తో 30 నిముషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టిన విధానం పై గవర్నర్ కు వివరించారు. హడావుడిగా, రాత్రికి రాత్రి క్యాబినెట్ ఆమోదం పొంది బిల్లు పెట్టారని వివరించారు. అభ్యంతరం తెలిపిన తమ సభ్యులను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా గవర్నర్ కు తెలిపారు. వర్సిటీలకు చాన్స్ లర్ గా ఉండే గవర్నర్ కు కూడా సమాచారం లేకుండా బిల్లు తెచ్చిన విధానాన్ని వివరించారు.

సభలో వైసిపి సభ్యులు వాడుతున్న భాషపైనా చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా…వివిధ అంశాలపై గవర్నర్ కు చంద్రబాబు వివరాలు తెలిపారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు, ప్రజలపై కేసులు పెడుతున్న విధానాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉందని…..ఇలాంటి పరిస్థితులలో రాజ్యాంగ పరమైన పోస్టులో ఉన్న గవర్నర్ కలుగజేసుకోవాలని కోరారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో, అనేక అంశాలపై తాము ఫిర్యాదులు చేసిన విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. అయితే బిల్లు తెచ్చిన విషయం కూడా తనకు తెలియదని గవర్నర్ టిడిపి నేతలతో అన్నారు.

Leave a Reply