Suryaa.co.in

Telangana

రేవంత్‌కు రాహుల్ అపాయింట్‌మెంట్ లేదు

– వత్తాండు.. పోతాండు.. రేవంత్‌ను దేకేవాడేలేదు
– 11 సార్లు ఢిల్లీకి అదేపనిగా పోయినా కలవని రాహుల్
– ఏ పని కావాలన్నా 30శాతం కమిషన్
– ఇందిరాపార్కు, ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు .

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లలో కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ప్రజలు హామీలు నమ్మడం లేదని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన్రు. రాహుల్ గాంధీని తీసుకు వచ్చి హామిలిప్పించారు.

సోనియా గాంధీతో లెటర్లు రాయించారు. హామీలన్నీ ఏమయ్యాయి

11 సార్లు ఢిల్లీ పోయినా రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి.

పోతున్నడు వస్తున్నడు కానీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ రేవంత్ కు లేదు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ స్పందించి ఆర్ఎంపీ, పీఎంపీలకు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాడులు లేవు, కేసులు లేవు

కాంగ్రెస్ హయాంలో ఏ రాత్రి ఎవరు వస్తరో, ఎట్ల అరెస్టులు చేస్తరో తెలయని పరిస్థితి.

ఆర్ఎంపీలను పోలీసులను పెట్టి వేధిస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టలో చెప్పారు.కేసులు పెట్టి బతుకు దెరువు లేకుండా చేస్తున్నారు. ఆర్ఎంపీలను రోడ్ల మీదకు తెచ్చారు. రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య మంత్రి తక్షణం స్పందించి ఆర్ఎంపీలపై కేసులు పెట్టకుండా చూడాలని, ఎన్నికల హామీలో చెప్పినట్లు ట్రైనింగ్ ఇప్పించాలని, సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం.

బీఆర్ఎస్ హయాంలో మీకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తే, కొందరు స్టేలు తెచ్చారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తే, స్టేలు తెచ్చారు. స్టేలు తెచ్చినా మేం మీ బతుకు దెరువు ఎక్కడా ఆపలేదు. మీ మీద కేసులు పెట్టలేదు. పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పలేదు.

కాంగ్రెస్ వాళ్లు వచ్చినంక అందరి బతుకులు రోడ్డున పడ్డయి.

గీత కార్మికుల పొట్ట కొడుతున్నరు. అక్రమ కేసులు పెడుతున్నరు రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, చివరకు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు.
మొదటి హామి మహాలక్ష్మి, చివరి హామీ పింఛన్లు దిక్కు లేదు. nరైతు రుణ మాఫీ మీద ఏ ఊర్లకైనా పోదాం చర్చిద్దాం. ఇవ్వాల్సింది 45వేల కోట్లు, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెబుతున్నది 21, ఇచ్చింది 15, 16వేల కోట్లు.

రుణమాపీ ఓ మోసం. ఆ 15,16 వేల కోట్లు ఎట్ల ఇచ్చిండంటే.. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి 8వేల కోట్లు, రుణమాఫీకి ఇచ్చిండు.

రెండు నెలల పింఛన్ 2వేల కోట్లు ఎగ్గొట్టి, రుణమాపీకి ఇచ్చిండు.

కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ, రంజాన్, క్రిస్టమస్ చీరెలు వెయ్యి కోట్లు ఎగ్గొట్టి, రుణమాపీకి మలిపిండు. కేసీఆర్ ఇచ్చే న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు బంద్ పెట్టిండు. అందులో రెండు వేల కోట్లు. పిల్లల ఫీజు రియింబర్స్ మెంట్ కూడా ఎగ్గొట్టిండు. 2500 కోట్లు రుణమాపీల కలిపిండు.ఇట్ల కోతలు కోసిండు రుణమాఫీలో కలిపిండు.

ఇచ్చింది ఏముంది. చేసిన హామీలు ఏమయ్యాయి? ప్రజలు ఎవరు వచ్చినా ప్రతి రోజు సీఎం కలుస్తడు అంటడు. 15 నెలలు అయినా ఎవర్నీ కల్వలేదు. కొడంగల్ వాళ్లను కూడా రానివ్వని పరిస్థితి. మీ సత్తా చూపే సమయం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కలసి ఉండాలి. విడిపోయి ఉండొద్దు. అప్పుడే మీకు బలం ఉంటది

కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కంకణం కట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గాల్లో ఉన్నడు. గాలి మోటర్లు, విమానాల్లో తిరుగుతున్నడు ప్రజాస్వామ్యంలో ఓటే బలం. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్ఎంపీ, ఫీఎంపీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి, ప్రశ్నిస్తా నిలదీస్తా

ఇప్పటికే అరెస్టు చేసిన వారి మీద వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మీకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటది

ఓట్లప్పుడు మాటలు చెప్పిండు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నడు. అడిగితే ఉల్టా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నడు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప. 30 పర్సెంట్ గవర్నమెంట్ అని ఎమ్మెల్యేలే చెబుతున్నరు. ఏ పని కావాలన్నా 30శాతం కమిషన్ పోలీసు వాళ్లకు జీతాలు రావడం లేదు, ఆరోగ్య భద్రత పని చేస్తలేదు

పోలీసులు, ఆటో డ్రైవర్లు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నది

ఉద్యోగస్థులకు డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ అయిన వారికి బెన్ఫిట్స్ ఇవ్వడం లేదు. మాటల గారడీ, అంకెల గారడీ అని అందరికి అర్థం అయ్యింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామని చూస్తున్నరు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పొయ్యి ప్రచారం చేసిండు. 80 స్థానాల్లో 77కి డిపాజిట్లు గల్లంతు.

ఇక్కడ పని చేసి వేరే రాష్ట్రాల్లో వెళ్లి ప్రచారం చేసుకో. తెలంగాణలో ఏ ఊళ్లకు పోయినా నీ పాలన గురించి చెబుతారు రేవంత్ రెడ్డి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉపన్యాసాలు దంచడం కాదు, గల్లీకి పోదాం రా రేవంత్ రెడ్డి. వడ్ల బోనస్ పైసలు ఇప్పటికీ వేయలేదు. 440 కోట్లు పెండింగ్ ఉన్నయి.

మన నెత్తి కొట్టి మనకు పెట్టడం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగ చేసిందేం లేదు.

ఒకే ఏడాదిలో లక్షా 47వేల కోట్ల అప్పు చేసిండు. ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఓ కాళేశ్వరం కట్టింది లేదు, చెరువు చెక్ డ్యాం నిర్మించింది లేదు.

10 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4కోట్ల 17లక్షలు చేస్తే, రేవంత్ ఒకే ఏడాదిలో లక్సా 47వేల కోట్లు చేసిండు..

ఒక్క రూపాయి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. పైసా ఇవ్వలేదు. ధైర్యం కోల్పోకండి. కష్టం వస్తే పోరాడాలి. సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఆర్ఎంపీ, పీఎంపీలకు 20ఏండ్ల క్రితం ప్రభుత్వ జాగాలో, ప్రభుత్వ పైసలతో భవనాలు కట్టించి, మీ ఆత్మగౌరవం కాపాడినం. అసెంబ్లీలో నేను, బయట మీరు పోరాటం చేయండి.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు సురుకు పెట్టాలె. ఓట్ల రూపంలో కర్రు కాల్చి వాత పెట్టాలె. ప్రజలు ఎంత కోపంగా ఉన్నరో తెల్వాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలి
వైద్యారోగ్య మంత్రి వద్దకు తీసుకువెళ్లి మీ సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాం.

LEAVE A RESPONSE