– తెలంగాణ ఆర్ధిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు
– హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు
– తెలంగాణ పరువు బజార్లో పెడుతున్న రేవంత్
– అపార పరిపాలనా అనుభవం ఉందని కోసిన కోతలు ఏమైయ్యాయి?
– ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివనట్లుంది
– ఖజానా దివాలా తీసిందన్న సీఎం రేవంత్ పై తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా : రేవంత్ చేతగాని అసమర్థత సీఎం. ఒక్క క్షణం కూడా సీఎం గా ఉండే అర్హత రేవంత్ కి లేదు. వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మొదటి నుండి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమని తెలిపోయాయి.
ఓనమాలు రాని వాడు పదో తరగతి చదివనట్లుంది రేవంత్ తీరు. తెలంగాణ ఆర్ధిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు. రేవంత్ కి పరిపాలన చేతకావట్లేదనేది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అప్పులతో ఏర్పడిన తెలంగాణాను కేసీఆర్ రెండున్నర లక్షల కోట్ల ఆదాయం తెచ్చారు.
రాష్ట్ర ఆదాయం తగ్గి మంత్రుల ఆదాయం పెరగడంతోనే అసలు సమస్య వస్తుంది. మాఫియాలా రాష్ట్ర ఆదాయం లూటీ చేసి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. సీఎం పదవికి లంచాల కోసం మంత్రులు పోటీ పడి సంపాదిస్తున్నారు. హామీలు ఎగ్గొట్టడం కోసమే రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు.
నిన్న రేవంత్ మాట్లాడిన మాటల్లో ప్రతి అక్షరం అబద్ధమే. ఎన్నికల ముందు ప్రజలని రెచ్చగొట్టి హామీలిచ్చి నేడు చేతులెత్తేస్తున్నారు. మాది వందేళ్ళ చరిత్ర , అపార పరిపాలనా అనుభవం ఉందని కోసిన కోతలు ఏమైయ్యాయి?
రేవంత్ లా కేసీఆర్ బాద్యమతారాహిత్యమైన హామీలియ్యలేదు.ఆదాయ వ్యయాలు తెలుసు కాబట్టే కేసీఆర్ రేవంత్ లా ఎక్కువిస్తామని చెప్పలేదు. అధికారం కోసం ప్రజలకు హామీలిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారు. తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టే మోసపూరిత హామీలు మేము ఇవ్వలేదు.
లూఠీలు కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ మాటలు. అప్పే అవసరంలేదన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. ఒక్క సంవత్సరం మంత్రులు కడుపుకట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి. రేవంత్ దొంగ చరిత్ర చూసి అందరు ఆయన్ని చెపులెత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారు. తెలంగాణ పరువు బజార్లో పెడుతున్న రేవంత్ .. 420 హామీలిచ్చామని చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి.