Suryaa.co.in

Telangana

ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు

– ఎంపీ రవిచంద్ర

హైదరాబాద్‌: రైతులు, ఆర్టీసీ కార్మికులు,ప్రభుత్వోద్యోగులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో చిత్తశుద్ధి పూర్తిగా లోపించడంతో బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారని,”డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల సుపరిపాలనలో అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెంది బంగారుమయంగా మారిన రాష్ట్రాన్ని పాలన చేతగాని రేవంత్ రెడ్డి అధోగతి పట్టిస్తున్నారని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వోద్యోగులు,ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడం చేతకాక బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని,బెదిరిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రాష్ట్రం అప్పుల పాలైందని, దివాళా తీసిందని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి సందర్భంలోనూ పదేపదే అంటూ తెలంగాణ పేరుప్రతిష్టలను దిగజార్చారని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు. ప్రజలకిచ్చిన 432 అలవికాని హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు.

LEAVE A RESPONSE