హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు

-గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఎన్నికలు..
– చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీ లో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు ఆయన సీఎల్పీ లో మీడియా తో చిట్ చాట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్న అంశాలను ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ లో హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తిరుగుబాటు తప్పదని అన్నారు. విజయ గర్జన సభ పెడ్త అని కేసీఆర్ ప్రకటించడం, రాబోయే తిరుగుబాటును ఎదుర్కోడానికే నని ఆయన పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే వున్నారని అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
ముందస్తు ఎన్నికలు రావని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావని, 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఆయన వివరించారు., విజయ గర్జన సభలు కేసీఆర్ భయంతోనే పెడ్తుండని ఇవే టీఆరెఎస్ పార్టీకి చివరి సభలు అవుతాయని అన్నారు..
హరీష్ రావు ను కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతాడని, మిత్ర ద్రోహి పేరుతో.. స్మశాన వాటికకు పంపుతాడని ఈటెల గెలిచిన ఓడిన ఎవరికి లాభం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి, 2022 ఆగస్ట్ 15 తో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, దీంతో కొత్త శకానికి నాంది అని కేసీఆర్.. ఎన్నికలకు వెళ్తారని రేవంత్ రెడ్డి చెప్పారు.
మోడీ డైరెక్షన్ లో కేసీఆర్ గుజరాత్ ఎన్నికలతో కలిసి ముందస్తు ఎన్నికలలో వెళ్తారని, రాష్ట్రంలో బిజేపి ని బలోపేతం చేసే.. కుట్ర జరుగుతోందని వివరించారు. ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే తన పార్టీలో మరింత గందరగోళం వస్తదని కేసీఆర్ చెప్పడం లేదని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్తితి లేదు కాబట్టి, వారిని ముందస్తుగానే అలర్ట్ కాకుండా ఈ డ్రామా ఆడుతున్నడని అన్నారు.
ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ ను ఎవరు అడిగారు? ముందస్తు ఎన్నికల విషయం ఎందుకు మాట్లాదుతున్నారని అన్నారు. మరో రెండేళ్లు నా సర్కార్ అధికారంలో ఉంటుందని చెప్పుకోవడం కోసమే, ఈ ముందస్తు ఉండదని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.
విజయ గర్జన సభ ఎందుకు పెడ్తున్నాడని, రాష్ట్రంలో ఏం అభివృద్ధి, సంక్షేమం సాధించాడని విజయ ఘర్జన సభ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎంపీలు 16 గెలుస్తం, కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంటున్నారు. ఇది దేనికి సంకేతమని అన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో.. దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్త అని వుంది, దళితలు, సీఎం పదవి కావాలని అడగలేదు. దళిత సీఎం అని ముడేకరాల భూమి ఇస్తా అని కేసీఆర్.. మోసం చేసిండని అన్నారు.
దళిత బంధు కూడా అడగలేదు.. వాళ్లు అడిగింది a,b,c,d వర్గీకరణ. అది ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ ఆర్ ఇన్నిసార్లు ప్రధానికి కలిశారు కదా.. ఎప్పుడైనా ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ గురించి ప్రధాన మోడీని ఆడిగారా అంటూ కేసీఆర్..దళిత ద్రోహి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సొంత పార్టీ లోనే దళితులకు ప్రాధాన్యత లేదని, పార్టీ అధ్యక్ష పదవీ కోసం.. కేసీఆర్ నామినేషన్ వేసే సమయంలో.. ఒక్క దళితుడు కూడా లేరని నిన్న వేదికపై కూడా కేసీఆర్ పక్కన దళితున్ని కూర్చోబెట్టుకొలేదని వివరించారు.
దళిత ద్రోహి నాయకత్వంలో.. మరో దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింలు జాయిన్ అవుతున్నాడని అన్నారు.
యూపీ ఎన్నికల్లో బీజేపీ కి కేసీఆర్ సహకారం ఉంటుందని, దాని వెనక అంతర్గత ఒప్పందం జరిగిందని .. కేసీఆర్ పై కేసులు, దాడులు జరగకుండా ఒప్పందం జరిగిందని అన్నారు. గుజరాత్ ఎన్నికల సమయానికి తెలంగాణ సర్కారును సర్కార్ ను కేసీఆర్ రద్దు చేస్తాడని అన్నారు. సర్కార్ ను నడపాల్సిన సమయంలో పార్టీ పై కేసీఆర్ దృష్టి పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేనని అన్నారు..

Leave a Reply