కేసిఆర్ ను చెప్పులతో కొట్టుడే…గద్దె దింపుడే

– కేసిఆర్ ను బొందపెడుతాం, దరణి పోర్టర్ ను గంగలో కలుపుతాం
– జయశంకర్ స్వగ్రామం అక్కంపేట లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ

తెలంగాణ కు దార్శనికత ఇచ్చిన జయశంకర్ స్వగ్రామాన్ని చూడాలని అక్కంపేట కు వచ్చా. వెనుకబాటుతనానికి మచ్చుతునకలా ఉంది. కేసిఆర్ సన్నాసి కనీసం జయశంకర్ విగ్రహాని పెట్టలేదు. జయశంకర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన మధుసూదనచారి ఉద్యోగం ఊడగొట్టిండు కేసిఆర్. జయశంకర్ పేరు ఎత్తకుండా గుర్తులేకుండా చేశారు. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ ను తూచా తప్పకుండా అమలు చేస్తాం. కేసీఆర్ ను బొందపెడుతాం, దరణి పోర్టర్ ను గంగలో కలుపుతాం.

రావిచెట్టు క్రింద పోచమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నా. కేసీఆర్ ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే. అక్కంపేటను కాంగ్రెస్ దత్తత తీసుకుంటాం. అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ ని అక్కంపేటకు తీసుకువస్తాం. అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. ల్యాండ్ పూలింగ్ కు భూములు పోకుండా పోరాడుదాం. అవసరమైతే భూములు కాపాడేందుకు రైతులతో కలిసి నేను పోరాడేందుకు వస్తా.

దళిత ఇంటికి వెళ్ళితే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేదలను దళితులను వేదిస్తే చెప్పుతో పొట్టుపొట్టు కొడుతాం.revanth2 ఐదువేల జనాభా గల అక్కంపేట ను రెవెన్యూ గ్రామం గా మార్చలేదు. ఈ గ్రామం మీద ఎందుకు కేసిఆర్ కు వివక్ష, కక్ష? .

Leave a Reply