దృష్టి మరల్చేందుకే కోనసీమలో అల్లర్లు:చంద్రబాబు

ఒంగోలు: గత 40 ఏళ్లలో తెదేపా ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తయితే.. ఈ మూడేళ్లలో వచ్చిన ఇబ్బందులు ఒక ఎత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.తమ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతగా రెచ్చిపోతారని చెప్పారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా ‘మహానాడు’లో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెదేపా ఉన్మాది పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని.. చేతగాని దద్దమ్మ పాలనతో రాష్ట్రం పరువు పోయిందని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నో పోరాటాలు చూసిన పార్టీ తెదేపా అని చెప్పారు. ఏపీ చరిత్ర తెదేపా రాకముందు.. వచ్చిన తర్వాత అని చదువుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తెదేపా రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. సేవా భావంతోనూ ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిందని గుర్తు చేశారు. వైకాపాకు అభివృద్ధి చేయడం చేతకాదని.. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని విరోధులుగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల కోసం పోరాడటం లేదని.. ప్రజలకు ఇబ్బందులుంటేనే నిలదీస్తున్నామని చెప్పారు.

రికమండేషన్లు వద్దు.. మీరు చేసిన పనే మీకు శ్రీరామరక్ష
పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరముందని.. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. నూతనోత్సాహంతో ఉండే వాళ్లను ఎంపిక చేస్తామని చెప్పారు. రికమండేషన్లు కాదు.. మీరు చేసిన పనే శ్రీరామరక్ష. పార్టీకి చేసిన సేవలన్నీ డాక్యుమెంటేషన్‌ చేస్తాం. సరైన వ్యక్తులను సరైన స్థానంలో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు చెప్పారు.
”మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరి వేసే పరిస్థితి తీసుకొస్తారా? మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా
babu-2 నష్టం వస్తుంది. వైకాపా పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మేం అండగా ఉంటాం. రైతులకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డి పెట్టారు. దానితోనే వసూలు మొదలు పెట్టారు. తెదేపా హయాంలో పెట్టిన అన్న క్యాంటీన్‌ తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక వంటి పథకాలన్నీ ఏమయ్యాయి? ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు తెదేపా హయాంలో ప్రత్యేక ప్రణాళిక తెచ్చాం. అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకెళ్లాం. తెదేపా.. వెనుకబడిన వర్గాల పార్టీ.

ప్రత్యేక హోదా ఏమైంది?
వైకాపా నేతలు ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారు. ఇప్పుడు నాసిరకం బ్రాండ్లతో దండుకుంటున్నారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు.. కనీసం ఇసుక దొరుకుతోందా? వైకాపా దోపిడీతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. భూములు దర్జాగా కబ్జా చేస్తున్నారు. మోసకారి సంక్షేమం అమలు చేస్తున్నారు. వైకాపా అవినీతి వల్లే రాష్ట్రం దివాలా తీసింది. రాష్ట్రాన్ని పాలించే అర్హత ఆ పార్టీకి లేదు. పోలవరం, విభజన హామీలు ఏమయ్యాయి? 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. అది ఏమైంది? గెలిచిన తర్వాత కేంద్రం వద్ద మెడలు వంచి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.

Leave a Reply