కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

-బస్సు, లారీ ఢీ.. 7 మంది మృతి, 26 మందికి గాయాలు!

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హుబ్లీ నగర శివార్లలో ఓ ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. ఇదే విషయాన్ని కర్ణాటక పోలీసులు తెలియజేశారు. కొల్హాపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు లారీని ఢీ కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ధార్వాడ్ వైపు వెళ్తోన్న లారీని బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం రాత్రి 12.30 నుంచి 1 గంట మధ్యలో జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఈ ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో స్థానికులు సహాయం చేశారు.

ప్రమాదంపై సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదే సమయంలో, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Leave a Reply