– బి.జె.ఎల్.పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను చేపట్టడం అభినందనీయం. పాకిస్తానులోని మూడు ఉగ్రవాద సంస్ధలకు చెందిన తొమ్మిది శిబిరాల్లో దాక్కున్న టెర్రరిస్టులను పెద్దసంఖ్యలో ఆపరేషన్ సింధూర్ ద్వారా హతమార్చిన భారత సైన్యానికి అభినందనలు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతకు భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను చేపట్టడం పట్ల దశప్రజలంతా గర్వపడుతున్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేలా చర్యలు తీసుకోవాలంటూ సైన్యానికి ఆదేశిచాడం ద్వారా భారత ప్రధాని మోదీ గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ప్రపంచానికే దిక్సూచిగా నిలువనుంది.
భారతీయులకు హాని తలపెట్టాలని చూసే దుష్ట శక్తులను మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్దితుల్లోనూ వదిలిపెట్టదని, వాటి అంతు చూస్తుందని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధాని మోదీ గారు మరోసారి నిరూపించారు. ఆత్మగౌరవ భారత్ ను, దుర్భేధ్య భారత్ ను తన సమర్ధ నాయకత్వం ద్వారా ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ గాకి, భారత సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతకు దిగిన భారత సైన్యానికి, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ గాకి అండగా దేశప్రజలంతా నిలబడాల్సిన సమయమిది.