– కొండల్ రెడ్డి ఇసుకమాఫియా తో రాష్ట్ర ఖజానా కు నష్టం
– ఎనిమిది వందల కోట్ల రూపాయల టార్గెట్ కోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు
– కొన్ని ప్రాజెక్టు ల దగ్గర నీళ్లు ఖాళీ చేసి మరీ ఇసుక తరలిస్తున్నారు
– రేవంత్ వచ్చినప్పటినుంచి జరిగిన ఇసుక అమ్మకాలన్నీ బయట పెట్టాలి
– రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ దందాలపై మరిన్ని వివరాలు త్వరలోనే బయట పెడతాం
– బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ ఇసుక దందా మొత్తం సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి కనుసన్నలో నడుస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. కొండల్రెడ్డి ఇసుక మాఫియాతో రాష్ట్రం తన ఆదాయం కోల్పోయి, అది కొండల్రెడ్డి జేబుల్లోకి వెళుతోందని బీఆర్ఎస్ యువ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అకమ ఇసుక దందా వివరాలను త్వరలోనే మరిన్ని బయట పెడతామని క్రిశాంక్ వెల్లడించారు.
పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ గతం లో మంత్రి హోదా లో వచ్చి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ ని ప్రశంసించారు. తమ రాష్ట్రం లో కూడా ఈ పాలసి ని ప్రవేశపెడతామన్నారు. రేవంత్ పాలన లో అక్రమ ఇసుక దందా పెరిగింది .రాష్ట్రానికి ఆదాయం తగ్గింది.
కేసీఆర్ హాయం లో కొత్త ఇసుక పాలసీ తో ప్రతీ ఏడాది 800 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది.ఉమ్మడి రాష్ట్రం లో ఇసుక ఆదాయం ఏడాదికి 19 కోట్లు కూడా దాటలేదు. రాష్ట్రానికి రావాల్సిన ఇసుక ఆదాయం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి జేబులోకి వెళ్తోంది. ఎనుముల కొండల్ రెడ్డి ఇసుకమాఫియా తో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోంది.
ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక పేరు తో టన్నుల కొద్దీ ఇసుక ను తరలించి అమ్ముకుంటున్నారు. మేడిగడ్డ బారేజి తో పాటు కొన్ని ప్రాజెక్టు ల దగ్గర నీళ్లు ఖాళీ చేసి మరీ ఇసుక ను తరలిస్తున్నారు. ఆదాయమేమో తక్కువ చేసి చూపుతున్నారు. ఇసుక అంతా ఎక్కడికి వెళ్తోంది ? లారీల అసోసియేషన్ కూడా ఓవర్ లోడింగ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇసుక పై రివ్యూ చేస్తే అవినీతి తగ్గించడానికి అనుకున్నాం. అయితే అలాంటి చర్యలు తీసుకోకపోగా పెంచేందుకు బాటలు వేశారు. మూడు షిఫ్ట్ ల్లో ఇసుక మైనింగ్ చేయాలనీ తాజా మినరల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు విరుద్ధం.
24 గంటల ఇసుక మైనింగ్ రేవంత్ రెడ్డి కుటుంబ ఆదాయం పెంచడానికే తప్ప ,రాష్ట్ర ఆదాయం పెంచడానికి కాదు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఈ ఏడాది లో ఐదుగురు ఎండీ లు మారారు. రేవంత్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటినుంచి జరిగిన ఇసుక అమ్మకాలన్నీ బయట పెట్టాలి. అసెంబ్లీ లో బీ ఆర్ ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తుతుంది.
స్పీకర్ సమక్షం లో ఇసుక రికార్డులన్నీ బయట పెట్టాలి. రేవంత్ అధికారం లోకి వచ్చాక 200 కోట్ల మేర ప్రభుత్వానికి ఇసుక ఆదాయం తగ్గింది. ఇసుక మీద ఎనిమిది వందల కోట్ల రూపాయల టార్గెట్ కోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కేసీఆర్ హయం లో ఇసుక పై పదేండ్లలో 5900 కోట్ల ఆదాయం వచ్చింది. అపుడు ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇసుక మైనింగ్ జరిగేది. రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ దందాలపై మరిన్ని వివరాలు త్వరలోనే బయట పెడతాం