ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్&ఇండస్ట్రియల్ ఫెడరేషన్ డైరెక్టర్ గా శిద్దా సుధీర్ కుమార్

సోమవారం విశాఖపట్నంలోని ఫార్చూన్ ఇన్ శ్రీ కావ్య లో రాజ్యసభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి చేతులమీదుగా శిద్దా సుధీర్ కుమార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా నియామకం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రియల్ ఫెడరేషన్ నూతన అధ్యక్షులు పైడా కృష్ణ ప్రసాద్,ఆంద్రప్రదేశ్ అధికార భాష కమిషనర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. తనను ఆంద్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా ఎన్నుకున్నందుకు రాజ్యసభ సభ్యులు వి విజయ సాయి రెడ్డి కి,పైడా కృష్ణ ప్రసాద్ కు శిద్దా సుధీర్ కుమార్ పుష్పగుచ్చం అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు ,ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శిద్దా సుధీర్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ నెల 7 వ తేదీ తిరుపతి హోటల్ బ్లిస్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ తొలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ తెలియచేసారు.

Leave a Reply