Suryaa.co.in

Andhra Pradesh

శిఖర సమానుడు, అక్షరయోధుడు రామోజీరావు

మాజీ శాసనమండలి సభ్యులు, సి. రామచంద్రయ్య

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత, అక్షరయోధుడు చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం నన్ను ఎంతో ఆవేదనకు, బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. రామోజీరావు గారు తెలుగు సమాజానికి, దేశానికి చేసిన సేవలు విస్తృతం, అనన్య సామాన్యం. ఓ దశలో రాష్ట్రంలో రాజకీయ విలువలు పతనం అవుతున్న దశలో రామోజీరావు గారు సాగించిన అక్షర యజ్ఞం, రాజీలేని పోరాటం తెలుగునాట అక్రమార్కులు తోక ముడిచేలా చేసింది. ప్రజాస్వామ్య పునాదుల్ని పటిష్టం చేశాయి.

రామోజీరావు గారు తన సంస్థల ద్వారా, ప్రత్యేకించి జర్నలిజంలో నెలకొల్పిన ప్రమాణాలు అత్యున్నతమైనది. తెలుగు భాషకు, తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు తెలుగునాట ఎప్పటికీ గుర్తుండి పోతాయి. తెలుగువారి చరిత్రలో తనకంటూ రామోజీరావు ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకొని వెళ్లిపోయారు. ఆయన నమ్మిన విలువలు, నమ్మకాలను ఆచరించడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి కాగలదు. రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.

LEAVE A RESPONSE