Suryaa.co.in

National

చిన్నమ్మకు షాక్‌.. రూ.100కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఈ ఆస్తులను 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్న సమయంలో చిన్నమ్మ కొనుగోలు చేశారు. అప్పుడు వీటి విలువ దాదాపు రూ. 20లక్షలు కాగా.. ఇప్పుడు రూ.100కోట్ల వరకు ఉంటుందని అంచనా. 2014లో కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో ఈ 11 ఆస్తులను ‘‘ఆదాయానికి మించి ఆస్తులు’గా పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగానే ఐటీశాఖ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతి కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవించి ఈ ఏడాది ఆరంభంలో విడుదలయ్యారు.

LEAVE A RESPONSE