ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ యువనేత శిద్దా సుధీర్తో కలసి ఆయన సీఎం క్యాంపు ఆఫీసులో జగన్తో నేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాసవీ కల్యాణమండపాలు, ఆలయాలకు వెసులుబాటు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జిల్లాలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలు, జిల్లా రాజకీయాలపై సీఎంతో చర్చించారు.
కాగా దీనిపై ఆయన మాట్లాడుతూ తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, మంత్రి బాలినేనితో కలసి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పటిష్ఠతపై సీఎంతో చర్చించామని శిద్దా చెప్పారు. మంత్రి బాలినేని ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని, అదేవిధంగా పార్టీ ఇన్చార్జి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో పార్టీ వేగంగా వ్యాప్తి చెందుతుందని రాఘవరావు వివరించారు.