Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం

-చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాం.క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.

చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది.అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మన వంద రోజుల పరిపాలనకు రెఫరెండం.తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదాంపదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేశారు?

ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదు.. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు.బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కు తీసుకెళ్లిన మోదీ.. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు.గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకున్న మోదీ… మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు

రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది?ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీ అడుగుతున్నారు?

బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం.

పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారు.పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నాంమళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7 న జాతీయస్థాయి గ్యారేంటీలను ప్రకటించుకోబోతున్నాం. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నాం. ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారు.

LEAVE A RESPONSE