Suryaa.co.in

Andhra Pradesh

చెల్లికి ఆస్తి ఇచ్చినందుకు తలిదండ్రులను హత్య చేసిన కొడుకు

– కన్నవారిపై ట్రాక్టర్ నడిపిన కిరాతకం

పూసపాటిరేగ: మానవత్వం మంట కలిసింది. తోబుట్టువుకు తండ్రిలా అండగా నిలబడాల్సిన అన్న చెల్లికి ఆస్తి ఇచ్చినందుకు తలిదండ్రులపై పగబడ్డారు. చెల్లికి ఇచ్చిన భూమిని చదునుచేస్తున్నందుకు అడ్డుపడ్డ తలిదండ్రులను, రాక్షసత్వంగా ట్రాక్టర్‌పై ఎక్కించి హత్యచేయించిన కిరాకత దృశ్యమిది.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలు గ్రామంలో తల్లిదండ్రులను కుమారుడు ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపాడు. అప్పలనాయుడు (55), జయ (45)లను కుమారుడు రాజశేఖర్ హత్య చేశాడు. ఆస్తిలో చెల్లెలకి కూడా వాటా ఇచ్చారన్న కక్షతో రాజశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా విషయమై కొంతకాలంగా తల్లిదండ్రులు, కుమారుడి మధ్య వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని, కుమారుడు చదును చేసే ప్రయత్నం చేస్తుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అడ్డొచ్చిన తల్లిదండ్రులపైకి రాజశేఖర్ ట్రాక్టర్ పోనిచ్చాడు. దాంతో అప్పలనాయుడు, జయ ప్రాణాలు విడిచారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE