– పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి: మే నెల రెండో తేదీన రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు… రెండో తారీకు మోడీ సభకు నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఐదు ఆరు జిల్లాల నుండి రావడానికి ప్రజలు ఆసక్తి వ్యక్తం అని అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎల్లుండి ఎస్పీబీ సిబ్బంది వచ్చి ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఇంకా ఏమైనా ఏర్పాట్లు కావాలేమో పునర్ పరిశీలిస్తాం అన్నారు.
అవసరమైనంతవరకు వరకు సీడ్ యాక్సెస్ రోడ్డు ని పూర్తిగా ఉపయోగించుకొని ఆరోజు అవసరమైతే వెస్ట్రన్ బైపాస్ రోడ్డుని కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నాము అన్నారు. ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సి ఆర్ డి ఏ అధికారులు ఇతర అధికారులు పలు సూచనలు ఇచ్చారు.
రాజధాని రైతులను ఒక ముగ్గురిని డయాస్ మీదకి ఆహ్వానించి వారిని గౌరవించడం జరుగుతుంది. అదేవిధంగా స్క్రీన్ మీద రైతులు చేసిన త్యాగాలను బట్టి ఒక షార్ట్ ఫిలిం ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రాజధానులు భూమి ఇచ్చిన రైతులకు ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభావేదిక వద్దకు వెళ్లేందుకు అవసరమైన రోడ్ల ను మంత్రి పరిశీలించారు. సుమారు రెండు గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాని మోదీ పాల్గొనే సభా వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా 8 మార్గాలను సిద్ధం చేస్తున్నారు.
రాజధాని అమరావతి పునర్మిర్మాణ పనుల ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అమరావతి పనులు రీలాంచ్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మే రెండో తేదీన ప్రధాని మోడీ అమరావతికి రానున్నారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ప్రధాని సభకు వచ్చే వాహనాల కోసం మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటుచేస్తున్నారని మొత్తం 8 రోడ్ల ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చన్నారు.