గంగారామ్ ఆసుపత్రి నుంచి సోనియా డిశ్చార్జ్

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా సోకిన కారణంగా చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి సోనియా డిశ్చార్జీ అయినట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకుట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో సోనియా గాంధీని ఆసుపత్రి వైద్యులు సోమవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. కాసేపటి క్రితం సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి తన నివాసానికి చేరుకున్నారు.

Leave a Reply