Suryaa.co.in

Telangana

మామిడికాయలలో కార్బైడ్ వాడకం తగ్గించేందుకు చర్యలు

– అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
– ప్రతి పండ్ల మార్కెట్లో తనిఖీలు చేపట్టాలి
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: మామిడి సీజన్లో మామిడికాయలు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్ వాడకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి, మార్కెట్ యార్డులలో కార్బైడ్ ను ఎవరు వాడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్బైడ్ వాడకంతో ప్రజలకు ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయని మంత్రి తెలియజేశారు.

మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి డిప్యూటి డైరెక్టర్ ప్రసాద్ రావు, ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ రాజేశ్వరి రి సిబ్బందితో కలిసి మార్కెటింగ్ అధికారులు జాంబాగ్, బాటసింగారం పండ్ల మార్కెట్లను సందర్శించి, తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా మోతాదుకు మించి ఎథోఫోన్ ఎథిలిన్ ప్యాకెట్లను పండ్ల పక్వం కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించి, వాటిని సీజ్ చేసి ఐపిఎం పరిశీలనకోసం పంపించడం జరిగింది. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రిగారు ఈ సందర్భంగా తెలియజేశారు.

LEAVE A RESPONSE