Suryaa.co.in

Andhra Pradesh

సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే

నియోజకవర్గ అభివృద్ధి కి కుల సంఘాల నేతల సలహాలు స్వీకరిస్తా
– వివిధ కుల సంఘాల నేతలు

విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వై ఎస్ సుజనా చౌదరి కి మద్దత్తు పలికిన వివిధ కుల సంఘాల నేతలు ఆదివారం విజయవాడ లోని ఆయన నివాసం లో కలిసి మాట్లాడారు.పశ్చిమ లోని బడుగు వర్గాల ప్రజల్లో గొప్ప కదలిక వచ్చిందని సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే అన్నారు.

ఈ సందర్బంగా సుజనా చౌదరి మాట్లాడుతూ తాను గెలుపొందాక పశ్చిమ నియోజకవర్గం లోని పేదరికం పోగొట్టడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తాను అన్నారు. సుజనాని కలిసిన వారిలో బీజేపీ అధికార ప్రతినిధి మాదిగ దండోరా నాయకుడు,మాజీ చైర్మన్ ఎస్ సి కార్పొరేషన్ ఆర్.డి విల్సన్,మాల మహా సభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకటరావు, మాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు,రెల్లి కుల సంఘం జాతీయ అధ్యక్షులు భూపతి అప్పారావు, నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు కేవీ రామారావు,మాల మహానాడు జిల్లా నేత బండి బాల యోగి వడ్డెర సంఘం నాయకులు తులసీ రామ్,తదితరులు వున్నారు.కాగా ఇటీవల జరిగిన దళిత, గిరిజన, బహుజన సమ్మేళనం విజయ వంతం చేసి మద్దతుగా సభ జరిపిన కార్యక్రమ సమన్యయ కర్త ఆర్. డి.విల్సన్ ను ఆయన ప్రత్యేకం గా అభినందించారు.నియోజకవర్గం అభివృద్ధి కి కుల సంఘాల నేతల సలహాలు స్వీకరిస్తానన్నారు.

 

LEAVE A RESPONSE