Suryaa.co.in

Telangana

ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పట్నం మహేందర్‌ రెడ్డి, మెదక్‌ జిల్లా ఎమ్మెల్సీగా గెలుపొందిన వంటేరి యాదవరెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్ జిల్లా నుంచి గెలుపొందిన ఎల్. రమణ నేడు శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు తన్నీరు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వి. శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఏం. ఎస్ ప్రభాకర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE