– 15ఏళ్లుకు పైగా భర్తీ కి నోచుకోని నర్సింగ్ , పారా మెడికల్ పోస్టుల భర్తీ కి చర్యలు
– ఈ. ఎస్. ఐ. వైద్య సేవలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు
– కార్మిక, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి.సుభాష్
• తిరుపతి ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సుభాష్
– మెరుగైన సేవలు అందిస్తున్న తిరుపతి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. శ్యాంబాబు కు అభినందన
తిరుపతి ఆసుపత్రి తనిఖీ సందర్బంగా మంత్రి సుభాష్
తిరుపతి: రాష్టంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర కార్మిక,ఫ్యాక్టరీలు,బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి. సుభాష్ ప్రకటించారు. ఆయన బుధవారం మధ్యాహ్నం తిరుపతి కార్మిక రాజ్య బీమా (ఈ. ఎస్. ఐ )ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఆసుపత్రి లోని అవుట్ పేషెంట్ బ్లాక్, అత్యవసర విభాగం, ఓ. పి. రిజిస్ట్రేషన్ విభాగం, ఇతర విభాగాలను తనిఖీ చేశారు.
గత సంవత్సరం నవంబర్ లో ఆసుపత్రి సందర్శన కు వచ్చినప్పుడు వున్న అవుట్ పేషెంట్స్ నమోదు సంఖ్య 150 నుండి ప్రస్తుతం 350 వరకు పెరగడం పై,అలాగే, ఇన్ పేషెంట్స్ అడ్మిషన్స్ సంఖ్య 30 నుండి 53 వరకు పెరగడం పై కూడా సంతృప్తి వ్యక్త పరిచారు.
అలాగే పేషెంట్స్ కు గత 5 ఏళ్లుగా సక్రమంగా లేని ల్యాబ్ కిట్స్, రీ ఏజెంట్స్, ఇతర పరికరాలను సుమారు 5 లక్షల తన సొంత ఖర్చుతో సమ కూర్చడం పై, ఇతర సేవలు సమకూరడంపై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. ఎం. శ్యాంబాబు ను అభినందిస్తూ దుస్సాలువతో సన్మానం చేశారు. రాష్ట్రము లోని ఇతర ఆసుపత్రి లు, డిస్పెన్సరీ లు తిరుపతి ఆసుపత్రి ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రము లో సిబ్బంది పనిచేస్తూ కార్మికులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి వాసంశెట్టి. సుభాష్ ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు.
గత ఆరు సంవత్సరాలకు పైగా రాయలసీమ, నెల్లూరు లాంటి జిల్లాల ఈ. ఎస్. ఐ. కార్మికులకు అందని ద్రాక్ష గా వున్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి సెకండరీ, టెరిషరీ రేఫరల్ వైద్య సేవలు.. మరి కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొంటూ, ఇందుకు ప్రత్యేక కృషి చేసిన రాష్ట్ర బీమా వైద్య శాఖ డైరెక్టర్ వి. ఆంజినేయులు, ఈ. ఎస్. ఐ. కార్పొరేషన్ సంస్థ విజయవాడ రీజినల్ డైరెక్టర్ , తిరుపతి ప్రాంతీయ అధికారులకు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్నీ ఈ. ఎస్. ఐ. ఆసుపత్రి లలో కార్మికులకు మెరుగైన ల్యాబ్ సర్వీస్ లు, ఇన్ పేషెంట్స్ సేవలు అందించేందుకు అన్నీ చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి సుభాష్ పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర బీమా వైద్య శాఖ లో గత 15 ఏళ్లుగా భర్తీ కి నోచుకోని నర్సింగ్, పారా మెడికల్ పోస్టుల భర్తీ కి చర్యలు తీసుకొంటున్నట్టు ఆయన చెప్పారు.
ఈ. ఎస్. ఐ.లో ఎటువంటి అలసత్వం ను సహించమని, అలాగే కష్టపడి సంస్థ అభివృద్ధి చేసేవారిని మరిచేది లేదని ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి నా వైపునుండి అన్ని తొందరలో సమకూర్చి మళ్ళీ కలుస్తానని చెప్పారు. ఈ తనిఖీ సందర్బంగా మంత్రి వెంట ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. ఎం. శ్యాంబాబు, సి. ఎస్. ఆర్. ఎం. ఓ. డాక్టర్. AVS ప్రసాద్ తదితరులు వున్నారు.