ఇటీవలే వైసీపీకి గుడ్బై చెప్పిన తాడిశెట్టి మురళి, తాడిశెట్టి సోదరులు తదుపరి కార్యాచరణ త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు. అయితే తాడిశెట్టి మురళి జనసేనలో చేరుతారా లేదా టీడీపీలో చేరుతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఒక ప్రముఖ ఛానల్లో వారు జనసేనలో చేరుతారనే వార్తలు వచ్చాయి. వాటికి తెరదింపుతూ ఇప్పుడు తాడిశెట్టి సోదరులు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. బుధవారం మధ్యాహ్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనే యులు, తాడిశెట్టి మురళి ఇంట్లో విందులో పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో తాడిశెట్టి సోదరులు ఈ నెల 5వ తేదీన భారీ ర్యాలీతో టీడీపీలో చేరబోతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్రవర్మ, జనసేన ప్రత్తిపాడు అధ్యక్షుడు గడ్డం నాగేశ్వరావు పాల్గొన్నారు.
Devotional
శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సుఖాలు
ఆవుపాలు.. శివుడిని ఈ రోజున ఆవుపాలతో అభిషేకిస్తే.. వారు సర్వ సుఖాలు అనుభవించువారవుతారని శాస్త్రం చెప్తోంది. ఆవు పెరుగు.. స్వచ్ఛమైన ఆవుపెరుగునను శివుడి అభిషేకంలో వాడితే వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారు. బలం చేకూరుతుంది. ఆవు నెయ్యి.. ఆవునెయ్యితో అభిషేకించిన వారు ఐశ్వర్యాభివృద్ధితో తులతూగుతారు. చెరకు రసం.. జీవితం దుఃఖమయంగా మారి ఎటు చూసినా అవమానాలే…
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…