Suryaa.co.in

Andhra Pradesh

అరాచకాంధ్రపై ఆవేదనకు నిలువుటద్దం

– ఆంధ్రులారా కళ్లు తెరవాల్సిన సమయమిది
– టీడీపీ పాటలు, వీడియోలు విడుదల చేసిన టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్

గురువారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల కోసం నాలుగు వీడియో పాటలను, రెండు షార్ట్‌ ఫిలిమ్‌లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్‌ పాల్గొన్నారు. గుమ్మడి గోపాల కృష్ణ రచించి, పాడిన ‘‘ఆంధ్రా మాత అల్లాడి పోతోంది ఈ దారుణ, మారణ దౌర్జన్యాలకు మౌనంగా రోధిస్తున్నది’’ అనే పాటను, చైతన్య ప్రసాద్‌ రచించిన, రమేష్‌ కొల్లి రూపొందించిన ‘‘తెలుగువీర పిడికిలెత్తి రా రా రా.. మన ఆంధ్రజాతి పౌరుశాగ్ని నీవేరా’’…అనే పాటను, గుమ్మడి గోపాల కృష్ణ రచించి, గానం చేసిన మరొక పాట ‘‘మేమంతా సిద్ధం.. ఓటు నీకు గుద్దం.. జగన్‌న్ను గద్దె దింపేద్దాం.. చంద్రబాబును సీఎం చేద్దాం’’.. అనే పాటను, సుద్ధాల అశోక్‌ తేజ రచించి, ధనుంజయ పాడిన ‘‘పిలు పిలు చంద్రబాబుని.. తెలుగు జాతి మేలు కోరే ఒకే ఒక్క నేతని’’.. అనే పాటను ఆవిష్కరించారు.

ఉషారాణి రూపొందించిన రెండు షార్ట్‌ ఫిలిమ్‌లను ఆవిష్కరించారు. ధర్మచక్రం పేరుతో రెండు పాటలనూ విడుదల చేశారు. ధర్మ చక్రం పేరుతో ‘‘ఓ మహాపురుషుడా”,.. “నీ చేతిలో బటన్‌ నొక్కుడు’’.. రెండు పాటలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా టి.డి. జనార్థన్‌ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు ఉన్న పరిస్థితులు రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోవడం, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వీటిపై చలించి సామాజిక స్పృహ ఉన్న వారు ఉషారాణి, రమేష్‌, కొడాలి వెంకటేశ్వర్‌ రావు, గుమ్మడి గోపాల కృష్ణ వంటి వారు కలిసి వీటిని రూపొందించారు. వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.

గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ… గతంలో విడుదల చేసిన పాటలు ప్రజాదరణ పొందాయి. ల్యాండ్‌ టైటిల్‌ అనే భయంకర చట్టం ప్రతి వాడిని నిద్రపోనీయని పరిస్థితిని తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో స్పందించి, చంద్రబాబు గారి కోసం ముందుకొచ్చి చేస్తున్నాం. ఈ పాటలను ప్రజల వద్దకు చేర్చి చంద్రబాబు గారిని మరల ముఖ్యమంత్రిని చేసే ఉద్యమంలో మీరందరి సహకారం కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కొడాలి వెంకటేశ్వరరావు, ఉషారాణి, రమణ, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE