Suryaa.co.in

Andhra Pradesh

సత్తెనపల్లి అసెంబ్లీలో తెలుగుదేశం దళిత చైతన్య యాత్రలు

– జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలు కరపత్రాల్లో పొందుపరిచి ఇంటింటికి ప్రచారం

తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశానుసారం రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని దళిత చైతన్య యాత్రలు జరిగాయి. యాత్ర లో భాగంగా జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేస్తున్న విధానాన్ని. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలు కరపత్రాల్లో పొందుపరిచి ఇంటింటికి కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి పెద్దిరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు శనగపోల వెంకయ్య, గ్రామ, కస్తాల దాసు, సులగా అప్పయ్య, దండు అప్పయ్య, నాయకులు తెలుగుదేశం పార్టీ, స్టేట్, జిల్లా, నియోజకవర్గ, పట్టణం, మండలం, గ్రామం,ఎస్సీ సెల్ నాయకులు, శనగ పూల నరసింహారావు, వర్ల శ్రీను, గుంటూరు ఆశీర్వాదం, బొజ్జ కాంతారావు ,బండారు నాగరాజు, చాట్ల దాసు,చిలుక చంటి,వెలిశాల వెంకట్రావు,బండారు ఏలియా,జంగాల శ్రీనివాస్, నాదెండ్ల రామారావు, చిలుక మనోహర్ , తాళ్ల పోగు చిన్న నాగులు, చిలక నాగరాజు గర్నెపూడి పేతురు తదితరులు పాల్గొని కరపత్రాలు ప్రచారం నిర్వహించారు

LEAVE A RESPONSE