సత్యకుమార్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాల దాడి దుర్మార్గమైన చర్య

-రౌడీయిజంతో ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం సిగ్గు చేటు
-దాడులను బీజేపీ సహించే ప్రసక్తే లేదు
-బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రౌడీయిజంతో ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం సిగ్గు చేటు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వెళితే దాడి చేయడం హేయమైన చర్య. రైతు సమస్యలపై పోరాడుతున్న ఎస్టీ, ఓబీసీ నాయకులపైనా దాడులకు తెగబడటం దుర్మార్గమైన చర్య.

ఏపీలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దాడులను బీజేపీ సహించే ప్రసక్తే లేదు. కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు. తక్షణమే ఏపీ ప్రభుత్వం స్పందించాలి. దాడి చేసిన వాళ్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply