లండన్ లోని ప్రేక్షకులను తెలుగు సిని గీతాలు అలరించాయి.
డివికే గేట్వేస్ సంస్థ అధ్వర్యములో లండన్ నగరములోని ఈస్ట్ హ్యాం నందు కల రాయల్ రీజేన్స్ హాల్ లో సంగీత విభావరి అంగరంగ వైభవంగా జరిగింది.
ప్రముఖ గాయనీ గాయకులు మనో, కార్తీక్, కల్పన , గోపిక పూర్ణిమ, అనురాధ శ్రీరాం మధురమైన గీతాలను ఆలపించారు. లండన్ ప్రేక్షకులును ఉర్రూతలూగించారు. నిర్వాహకురాలు లావణ్య కావూరి తెలిపారు. వినోద్ దొప్పలపూడి, సురేంద్ర తెలుగు ప్రావాసులందిర్ని ఆహ్వానించారు. ఈ సంగీత విభావరి కార్యక్రమానికి పన్నెండు వందలమందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు. కని విని ఎరుగని రీతీలో విచ్చేసిన మహిళలు, చిన్నారులు గాయకులు పాడిన పాటలకు డాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు.
ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. లండన్ లో పుట్టి పెరిగిన అమ్మాయి చిన్మయీ తడకమల్ల తన మాటలతో ప్రేక్షకులందరినీ ఆలరించింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతము కావాడానికి సహకరించిన శ్రీనివాస్ రెడ్డి పింగళి, సురెందేర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ గౌడ్ బైరు, వంశీ , హరీష్, భరత్ లను డివికే గేట్వేస్ సంస్థ యాజమానురాలు లావణ్య కావురి , వినోద్ సన్మానించారు.