విశాఖపట్నం : దేశ భద్రత కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు15బి (పీ15బి) పేరిట నిర్మించిన తొలినౌక భారత నౌకాదళంలో చేరింది. ముంబయి మజగాన్ డాక్లో అక్టోబరు 28న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తయారీ సంస్థ ప్రతినిధులు భారత నౌకాదళ అధికారులకు నౌక అప్పగింత పత్రాలను అందజేశారు. పీ15బి పేరిట నాలుగు నౌకల నిర్మాణానికి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ (ముంబయి) సంస్థ గతంలోనే ఆర్డర్లు దక్కించుకుంది. ఈనౌక 163 మీటర్ల పొడవుతో 30 నాటికళ్ల వేగంతో ప్రయాణం చేయగలదని నేవీ వర్గాలు తెలిపాయి. ఉపరితలం నుంచి (మిసైల్స్) గాలిలోకి, ఉపరితలం నుంచి (బ్రహ్మోస్) ఉపరితలానికి, టార్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు, సూపర్ ర్యాపిడ్ తుపాకులు కలిగి ఉండటం ఈ నౌక ప్రత్యేకత అని నేవీ వర్గాలు వివరించాయి.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…