ఏపీలో పోలీస్ వ్యవస్థ నిద్రపోతోంది

– త్వరలో ఏపీ పోలీసులపై కేంద్రహోం శాఖకు పిర్యాదు
– బీజేపీ ఎంపీ సీఎం రమేష్

ఏపీ పోలీసులపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఏం చెబితే అదే గుడ్డిగా చేస్తున్నారని మండిపడ్డారు.
ఆత్మకూరులో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలకు దిగింది. విజయవాడలో జరిగిన ఆందోళనలో సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ, ఏపీలో పోలీస్‌ వ్యవస్థ బాగోలేదని మొదట్నుంచీ చెబుతున్నానని అన్నారు. ఏపీ పోలీసులు నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. జరిగిన పరిణామాలను కేంద్రం పరిశీలిస్తోందని, ఘటనను సీరియస్‌గా తీసుకుందని అన్నారు. పోలీస్ వ్యవస్థ బాగుంటే.. శాంతి భద్రతలు బాగుంటాయన్నారు.రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సీఎం రమేష్‌ ఆరోపించారు.

Leave a Reply