Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే బాబూ జగ్జీవన్‌రామ్‌కు అసలైన నివాళి

-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
-పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమం

మంగళగిరి, మహానాడు: అవినీతి పాలకులను, నేరస్తులను గద్దె దించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే బాబూ జగ్జీవన్‌రామ్‌కు అసలైన నివాళి అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ… పేదరికంలో జన్మించి అత్యున్నత స్థాయికి ఎదిగిన జగ్జీవన్‌రామ్‌ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు సాంఘిక సంస్కర ణల కోసం కృషి చేశారని కొనియాడారు.

దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రిగా హరిత విప్లవం కోసం బాబూ జగ్జీవన్‌రామ్‌ చేపట్టిన సంస్కరణలు దేశాభివృద్ధికి బాటలు వేశాయన్నారు. ఉప ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాలరావు, ఏవీ రమణ, పీటర్‌, కోడూరి అఖిల్‌, కిరణ్‌, హసన్‌బాషా, శంకర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE